" గోరా"విశ్వవిఖ్యాత గురూజీ రబీ౦ద్రనాథ్ టాగోర్ వ్రాసిన ప్రఖ్యాతి గాంచిన నవల. గోరా నవల ఇతివృత్తం కథానాయకుడు గోరా, సిపాయి విద్రోహంలో హి౦దూ దంపతులకు దొరికిన ఐర్లాండ్ దేశీయుడీ శిశువు.అతనిని హైందవ సంప్రదాయంలో అతని గురించి ఎవరికీ తెలియకుండా పెంచుతారు. సంఘం పట్ల బాద్యత విస్మరించినందుకు శిక్ష వేసుకుంటుంది పెంచిన తల్లి. హైందవ పద్ధతులు పాటించకుండా ఒకే ఇంట్లో ఉ౦టూ భర్తకి శారీరికంగా దూరంగా ప్రత్యేకమైన తన గదిలో గడుపుతూ ఉంటుంది.
ఇవేమీ తెలియని గోరా హైందవ సంస్కృతిని బాగుగా జీర్ణి౦చుకుని వేరే మతాలను , ముఖ్యంగా బ్రహ్మ సమాజాన్ని హేయ భావంతో వీక్షిస్తాడు కాని బ్రహ్మ సమాజానికి చెందిన స్త్రీ సుచరిత పట్ల ఆకర్షితుడౌతాడు. అయినా తన హిందూ ధర్మాన్ని వోదులుకొనలేక సంఘర్షణకి లోనౌతాడు.
ప్రేమ కంటే విధి బలీయమైనదైనా, వీరి ప్రణయ వృత్తా౦తమందు వారి ఇద్దరిని మమేకం చేస్తుంది. గోరా తన పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుంటాడు , హైందవ ధర్మం అతనిని వెలివేస్తుంది దానితో అతను సుచరిత పాణిగ్రహణం చేసి బ్రహ్మసమాజంలో చేరుతాడు.
నేటి పరిస్థితులకు కూడా వర్తించే ఎన్నో విషయాలను గోరా నవల వివరిస్తుంది .చక్కటి పద సమూహాలు , సాదృశ్య వర్ణనలను, చక్కటి తార్కిక వాద ప్రతివాదాలతో కూడుకున్న సంభాషణలు కలిగినది ఈ నవల. వ్యక్తుల మానసికావస్థలను,అవసరాలను,సాంఘీక పరిస్థితులను చక్కగా విశ్లేషించారు.
మనోశాస్త్రం , సాహిత్యం , తార్కికం , సామాజిక శాస్త్రం అన్నిటినీ సమన్వయ పరిచి నిబిడీకృతం చేయబడిన నవల "గోరా. "
కేవలం ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులనే కాక సామాజిక మార్పుని , మతాల సంగమాన్ని , సమైక్యతని, ఆర్ధిక పరమార్ధాన్ని, సమ సమాజ జీవనాన్ని సూచిస్తూ అలనాడే ఆధునిక లోపరహిత సమసమాజ నిర్మాణానికి పునాది వేసిన నవ యుగ వైతాళికుడు రబీ౦ద్రనాథ్ టాగోర్.
నవల: గోరా
మూలము: రబీ౦ద్రనాథ్ ఠాకూర్
అనువాదము: శివశంకర స్వామి
నవల: గోరా
మూలము: రబీ౦ద్రనాథ్ ఠాకూర్
అనువాదము: శివశంకర స్వామి