Wednesday 3 July 2024

   సముద్రం                                                     

పాపినేని శివశంకర్

    2007 


ఒక కథ ఒక నవల కేవలం నిడివి మాత్రమే కాదు భారంలో హృదయపు అంచుల్ని తాకే విధానంలోకూడా  ఎన్నో తేడాలు.ఇది ఒక కథ కానీ నవలను మించిన గాఢత పరిపూర్ణత మనకి ఈ కథలో కనిపిస్తాయి . అధ్యాపక వృత్తిలో ఒదిగి పోయి  పుస్తక పఠనంలో ఇమిడిపోయిన  పుస్తక ప్రేమి విజ్ఞాన ఘని.  ఈ కథానాయకుడు అతని జీవిత ఆఖరి క్షణాలలో తన స్నేహితుని అడిగిన  ప్రశ్న "సముద్రాన్నిఎక్కడ పారబోయాలి" తో కథ మొదలు అవుతుంది . ఆ స్నేహితుడు వివరించిన అతని జీవితమే ఈ కథ "సముద్రం " 

కథా  వివరణలో ఒక వైవిధ్యం ఉంది . ఒక అల్జీమర్స్ పేషెంట్ తన గతమంతా గుర్తుచేయమని అడిగితే, అతని జ్ఞాపకాలని తన జ్ఞాపకాల సహకారంతో తూచి గత సంఘటనల ద్వారా నాయకుడికి వివరించే  వైనం వినూత్నంగా  ఉంటుంది.

అందరూ నాయకుని పుస్తకాల పురుగు అంటే  కథకుడు  పుస్తకప్రేమిని "పుస్తక మాలి " అని పిలవడం సాహిత్యాన్ని ఆరాధించే స్నేహితుల్ని గౌరవించే మంచి స్నేహం కనిపిస్తుంది. 

నీ ద్వారానే నాకు శ్రీ శ్రీ ,  చలం, తిలక్ పరిచయం నీ వల్లే  నేను సమాజాన్ని హేతుబద్దకంగా చూడడం నేర్చుకున్నాను అంటాడు కథకుడు. 

" విజ్ఞానానికి విలువున్న రోజులవి " అవును ఆ రోజులలో బ్రతికిన వాళ్ళకి ముఖ్య0గా సాహిత్యాన్ని ఇష్టపడే  వాళ్లకి ఈ కథ వాస్తవంగాను వారి  జీవితాలకి చేరువగాను అనిపిస్తుంది. 

ఉత్తరాల అందం ఆసాంతం మరిచిపోయిన ఈ రోజుల్లో ఉత్తరాలు రాసుకునే ఆ రోజుల్లో ఉత్తరాలలో " నీ అక్షరాలు స్ఫుటంగా నీ మనస్సు అర్థంచేసుకుని కాగితం మీద కుదురుగా కూర్చున్నట్లనిపించేది తొణుకు బెణుకు లేకుండా అచ్చంగా నీ మనస్సు మల్లేనే " అంటాడు కథకుడు తన స్నేహితుడు పుస్తకమాలి తనకి వ్రాసిన ఉత్తరాల గురించి. 

ఒక కాగితం కొన్ని అక్షరాల అమరిక కొన్ని భావనలు స్పందనలు అన్నీ వెరసి ఒక ఉత్తరం. కానీ ఉత్తర ప్రత్యుత్తరాలకి ఎంత అందం అద్దింది రచయిత భావ వ్యక్తీకరణ -- స్పందించే హృదయానికి మళ్లీ ఎవరికో ఒక అందమైన ఉత్తరం వ్రాయాలనిపించేటంతగా ఒకే ఒక్క వాక్యంతో ప్రేరేపించగలిగాడు రచయిత . 

మన తెలుగులో  ఇంత చక్కటి భావజాలం మాయమైపోయిందనే అనుకోవాలి . కనీసం ఇంతటి అందంతో ఈ స్థాయి లో సాహిత్యం ఉంటుందని తరువాత తరాలకి తెలిపే నాథుడు లేరు తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు లేకపోవడం తెలుగు సాహితీ రంగానికి ఓ విషాదమే . 

ఒక అధ్యాపకుడు ఎలా బోధిస్తే తన విద్యార్థులను ఆకట్టుకుంటాడో తన పాత్ర ద్వారా విశదీకరించి  " సమాచారం గాక వాళ్లలో సృజనాత్మకతను పెంచటమే నీ ఆశయం " అంటాడు కథకుడు. నీకు మల్లె బోధనా రంగం లో గాకుండా ----- రంగం లో స్థిరపడినందుకు  విచారం కలిగేది అని తన అసంతృప్తిని పుస్తక మాలి బోధనా వృత్తిపట్ల  తనలో రేకే త్తి0చిన inspiration ని చాటుకుంటాడు.  

" ఉద్యోగంతోనో పెళ్ళితోనో చాలా మంది విస్తరణ ఆగిపోతుంది కానీ నిన్ను నువ్వు పుస్తకాల పుటల్లో విస్తరించుకున్నావు "

అంటూ జీవితం లో ఒక సంఘటన కారణంగా ఘనీభవించకూడదు కలకాలం వృత్తి తో బాటు ప్రవృత్తి కూడా నిరంతర ప్రవాహం లా పారుతుండాలి అని రచయిత  ఉద్బోధ చేసి నట్లు  మనకి అనిపిస్తుంది . 

"మారుతున్న కాలాన్ని మారుతూ నువ్వు అవగాహన చేసుకున్న తీరు వాటిల్లో కనిపించేది" అంటాడు కథకుడు. పదాల కూర్పు రెండు మూడు సార్లు చదివితే పద అమరిక అందం తెలుస్తుంది. 

" చిన్న తనములోనే తల్లి దండ్రులు పోవటం వల్ల కలిగిన ఒంటరితనం పుస్తక పఠనంలో మరుగు పడిందేమో " కథానాయకుని మానసిక స్థితిని ఒక మనోవైజ్ఞానికుని వలే విశ్లేషిస్తాడు రచయిత .

వెలకట్టలేని పుస్తకాల గురించి మాట్లాడుకున్నామని చెబుతూ ఎన్నో విలువైన పుస్తకాల పేర్లని దేశ విదేశ గొప్ప రచయితల పేర్లని ఉదాహరణగా  పేర్కొంటాడు 

ఈ కథకుడు. 

"నీ మాటల్లో మళ్ళీ బ్రతికారు " 

ఆ రోజుల్లోనే మళ్ళి  బ్రతికారు  అని అంటే ఈ రోజుల్లో వాళ్ళు కనుమరుగై ఆవిరై  అస్తిత్వమే లేని వ్యక్తిత్వాలని మనకి వారి ఉనికిని పరిచయం చేస్తున్న రచయిత  బహుశా సాహిత్యానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్లుగా భవిష్యత్తుని ఆలోకించినట్లుగా అనిపిస్తుంది. 

"ఆ సాయంత్రం నేను నిజంగా జీవించిన రోజుల్లో ఒకటి " జీవించడం అంటే

 ఎలా ఉంటుందో రుచి చూపించాడు రచయిత . పుస్తక పఠనానికి ఊపిరి పోసింది

 ఈ కథ. 

                                                                                                                             contd.... 

No comments:

Post a Comment